13/06/2026
#త్రైలింగస్వామి దిగంబరులై తిరుగుతూ ఉండేవారు. అందువలన కొందరు పోలీసులు ఆయనను పట్టుకొని పోయి జిల్లా న్యాయాధిపతిముందు నిలబెట్టారు. న్యాయాధిపతి అట్లా తిరగటానికి వీలులేదని శాసించాడు. ధోవతి కట్టుకోవాలని ఆదేశించాడు. స్వామీజీ దాన్ని పట్టించుకోలేదు. న్యాయాధిపతికి కోపం వచ్చి బేడీలు వేసి చెరసాలలో పెట్టమని ఆదేశించాడు. వెంటనే పోలీసులు ఆయనకు బేడీలు వేయటానికి దగ్గరకు వెళ్లగా, స్వామీజీ వారికి కనబడలేదు. అక్కడ ఉన్నవారంతా ఆశ్చర్యపడ్డారు. వారు ఆ ప్రదేశమంతా దాదాపు గంటసేపు వెదికినా కనబడలేదు. ఆ తరువాత స్వామీజీ న్యాయాధిపతి ముందు హఠాత్తుగా ప్రత్యక్షమయ్యారు. స్వామీజీ ఎట్లా మాయమయ్యారో, మళ్లీ ఎట్లా ప్రత్యక్షమయ్యారో వారికి అర్థం కాలేదు. అదిచూసి వారంతా ఆశ్చర్యచకితులైనారు. న్యాయాధిపతి కొంతసేపటికి తేరుకొని, స్వామివారు తమకు నచ్చినవిధంగా తిరుగవచ్చునని అనుమతినిచ్చాడు.
ఈ సంఘటన జరిగిన కొద్ది రోజులకు మరొక అధికారి వచ్చాడు. ఆయన చాలా తీవ్రస్వభావం కలవాడు. ఒకరోజు ఆయన దృష్టి స్వామివారి మీద పడింది. స్వామీజీ దొంగ సాధువు అని తలంచి చెరసాలలో పెట్టి బంధించాడు. మరునాడు ప్రొద్దున ఆయనకు ఒక విచిత్ర సంఘటన కనిపించింది. అదేమిటంటే- స్వామీజీని బంధించిన చెరసాల అంతా బాగా నీళ్లతో తడిసి ఉండింది. చెరసాల తలుపుకు వేసిన తాళం అట్లాగే ఉండింది. కాని స్వామీజీ మాత్రం చెరసాల బయటివైపున అటూ ఇటూ పచార్లుచేస్తూ కనిపించారు. వెంటనే ఆ అధికారి- ‘‘నీవు చెరసాలనుంచి బయటకు ఎట్లా వచ్చావు? ఇంత నీరు చెరసాలలోకి ఎట్లా వచ్చింది?’’ అని అడిగాడు. స్వామీజీ చిరునవ్వు నవ్వి ‘‘అర్థరాత్రి నాకు మూత్రవిసర్జన చేయవలసి వచ్చింది. గదికి తాళంవేసి ఉండటంవలన గదిలోనే మూత్రవిసర్జన చేశాను.
ఉదయం కాగానే బయటకు పోవాలనే కోరిక కలిగింది. చూసేసరికి గది తలుపులు తెరిచి ఉన్నాయి. నేను బయటకు వచ్చేశాను. మీరు ఎవరి జీవితాన్నీ తాళంవేసి బంధించలేరని నిశ్చయంగా తెలుసుకోండి. ఒకవేళ ఆ విధంగా బంధించగలిగినా, వారిని మరణ సమయంలో బంధించి మరణం రాకుండా కాపాడగలరా? అంతకుముందు కూడా ఎవరూ మరణించరు. ఎవ్వరికీ అలాంటి శక్తి లేదు. మరి మీరు ఎందుకు అంతగా కోపగిస్తున్నారు?’’ అని అన్నారు. ఆ విచిత్ర సంఘటనను తన కళ్లారా చూసిన ఆ అధికారి అవాక్కయిపోయాడు.
ఆ తరువాత స్వామీజీ యథేచ్చగా తిరుగవచ్చని అనుమతి ఇచ్చాడు. స్వామీజీకి అయిష్టమైన పని ఎవ్వరూ చేయరాదని ఆజ్ఞాపించాడు.
Veda samskruti
13/06/2026
In Satya yug, Good and evil were in two different worlds: Dev Lok and Asur Lok.
In Treta in the same world: Ram and Ravan.
In Dwapar In the Same family: Pandav and Kaurav.
In Kali yug: in the same person.
As the Yug changes, the line between good and evil thins and blurs down.
- Swami Chinmayananda
13/06/2026
జూన్ 13, స్వామి నిగమానంద సరస్వతీ వర్ధంతి.
అవిరళ గంగ, నిర్మల గంగ - గంగా ప్రవాహం ఎక్కాడా ఆటంకం లేకుండా సాగిపోవాలి, గంగ కలుషితం కాకుండా నిర్మలంగా ఉండాలి - అనే నినాదంతో స్వామి నిగమానంద 19 ఫిభ్రవరి 2011 న ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించారు. దాదాపు 4 నెలలు, 115 రోజుల పాటు పోరాడి జూన్ 13, 2011 న తనువు చాలించారు.
గంగానది భారతీయులకు దేవత, అమ్మ, జీవం, సర్వం. అటువంటి గంగా నది పుట్టిన ఉత్తారాఖండ్ రాష్ట్రంలోనే అనేకమంది దుర్మార్గులు గంగను కలుషితం చేస్తున్నారు. అడుగడుగున ప్రాజెక్టులు నిర్మిస్తున్నారు. ఆ రాస్ట్రంలో సరాసరి సగటున గంగ మీద ప్రతి 10 కిలోమీటర్లకు ఒక ప్రాజెక్టు ఉందని అధ్యయనాల్లో తేలింది. అదే కాక, గంగానదిలో అక్రమ ఇసుక మాఫియా, రాళ్ళ మైనింగ్ పెద్ద ఎత్తున జరిగేవి. ఇవన్నీ గంగ పవిత్రతను దెబ్బ తీయడమే కాదు, అందులోని ఔషధి తత్త్వాన్ని సైతం నశింపజేస్తున్నాయి. పర్యావరణాన్ని నాశనం చేస్తున్నాయి. హిమాలయ పర్వత సాణువులకు తీరని నష్టం కలిగిస్తున్నాయి. గంగలో జరిగే అక్రమ మైనింగ్ను అరికట్టాలని, మాఫియాను నిర్మూలించాలని, గంగను కాపాడలని 1997 లో యువ సన్యాసులు, సాధువులు ఉద్యమం మొదలుపెట్టారు. ఎందరో మేధావులు సైతం మద్దతు పలికారు. ఆ ఉద్యమంలో స్వామి నిగమానంద కూడా పాల్గొన్నారు.
అలా గంగా రక్షణ ఉద్యమాన్ని తీవ్రం చేయడం కోసం స్వామిజి 17 ఫిభ్రవరి 2011 లో నిరాహార దీక్ష ప్రారంభించగా, ఆరోగ్యం క్షీణించిందని 68 వ రోజు, 27 ఏప్రియల్ న ఆసుపత్రిలో చేర్చారు. 30 ఏప్రియల్ నాడు ఎవరో దుండగుడు నర్సు వేషంలో వచ్చి, స్వామికి ఇంఫెక్షన్ కలిగించే ఇంజెక్షన్ ఇచ్చాడు. ఆ విషయం రిపోర్టుల్లో కూడా తేలింది. ఆ ఇచ్చింది కూడా మైనింగ్ మాఫియానే అని ఆరోపణలున్నాయి. అయినా నిగమానంద తన పోరాటాన్ని ఆపలేదు. చివరకు జూన్ 13 న తనువు చాలించారు.
విచిత్రమైన విషయం ఏమిటంటే ఈయన ఇంత పెద్ద దీక్ష చేపడితే, మీడియా ఆయన మరణించేవరకు కనీసం ఒక్క రోజు కూడా ఆ విషయాన్ని చూపించలేదు. విదేశీ డబ్బు తిని పర్యావరణ పరిరక్షణ అంటూ అరించే ఎన్జీవోలు, కుహనా - మేధావులు, కమ్యూనిష్టులు మద్దతు పలకలేదు. అప్పుడు ఆ రాష్ట్రలో బిజేపీ ఆధికారంలో ఉన్నా, నిగమానంద డిమాండ్ను పట్టించుకోలేదు. ప్రతిపక్ష కాంగ్రెస్ కూడా ఈ అంశాన్ని లేవనెత్తలేదు. ఆ మైనింగ్ మాఫియాలో అన్ని పార్టీల వారు ఉండడమే ఇందుకు కారణం. అదేకాక ఆ సమయంలోనే అవినీతిపై దీక్ష చేసిన బాబా రాందేవ్ను మీడియా బాగా ఫోకస్ చేసింది. ఆ తర్వాత వీరి దీక్షకు కొనసాగింపుగా స్వామి శివానంద దీక్ష చేపట్టిన తర్వాత 11 రోజులకు, నవంబరులో హరిద్వార్ ప్రాంతంలో మైనింగ్ ను నిషేధిస్తున్నట్టు ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది.
వీరి ఆఖరి కోరిక ఇంతవరకు నెరవేరలేదు. గంగ మీద ఇప్పటికీ విచ్చలవీడిగా ప్రాజెక్టులు కడుతూనే ఉన్నారు. అవిరళ గంగా - నిర్మల గంగా ఇంకా కలగానే ఉంది. నదులకు సనాతన సంస్కృతిలో ప్రత్యేక స్థానముంది. వాటిని పవిత్రంగా, పరిశుద్ధంగా, నిర్మలంగా ఉంచాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఎంత ఉందో, ఆ దిశగా గొంతు విప్పి, సాధించుకోవాల్సిన బాధ్యత ప్రతి హిందూ మీద ఉంది.
స్వామి నిగామానందకు శ్రద్ధాంజలి ఘటిస్తూ .................
Veda samskruti
13/06/2026
మన గ్రామాలను మనం ఇలా మార్చుకోలేమా? నగరాల్లో ఉంటున్నవారు కూడా ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకుని వాననీటిని ఒడిసిపట్టలేరా? భవిష్యత్తు తరాలకు పుష్కలమైన వనరులతో కూడిన భూమిని ఇవ్వలేమా? భూమాతను తిరిగి పరిపుష్టం చేయలేమా? ఇతరులతో సంబంధం లేకుండా మన వంతు కృషి మనం చేయలేమా?
చేయగలము. కానీ మనకు కావల్సింది సంకల్పం, ధృడసంకల్పం.
13/06/2026
Desire nothing for yourself. Do all for others. This is to live and move and have your being in God.
- Swami Vivekananda
13/06/2026
యక్ష ప్రశ్నలు -9
ప్రశ్న - బ్రాహ్మణుడు బ్రాహ్మణత్వాన్ని ఎలా పొందుతాడు?
సమాధానం - వేదాధ్యయనం చేయడం ద్వారా
13/06/2026
True fasting means ridding ourselves of all selfish designs, desires, not feeding them, purging ourselves wholly of them.
- Swami Rama Tirtha
13/06/2026
స్వామి శివానంద విరచిత #గురుతత్వము - 46వ భాగము
అత్రి మహర్షి తన ఆశ్రమానికి తిరిగి రాగానే, ఆయన లేని సమయంలో జరిగినవన్నీ అనసూయ మాత పూసగుచ్చినట్టు చెప్పింది. ఆ పిల్లలను ఆయన పాదాల వద్ద ఉంచి, ఆయనను పూజించింది. కానీ అత్రిమహర్షికి తన దివ్యదృష్టి ద్వారా జరిగినదంతా ముందే తెలుసు. ఆ ముగ్గురు పిల్లలను ఆయన దగ్గరకు తీసుకున్నారు. ముగ్గురు పిల్లలు రెండు కాళ్లతో, ఒక మొండెంతో, మూడు శిరస్సులతో మరియు ఆరు చేతులతో ఒకే పిల్లవానిగా మారారు. అత్రి మహర్షి తన భార్యను ఆశీర్వదించి, త్రిమూర్తులు పసిపిల్లలుగా రూపంలో తన వద్దకు వచ్చి అనుగ్రహించారని ఆమెకు తెలియపరిచారు.
నారదుడు బ్రహ్మలోకానికి, వైకుంఠానికి మరియు కైలాసానికి వెళ్ళి సరస్వతి, లక్ష్మీ మరియు పార్వతులకు తమ భర్తలు అనసూయ మాత వద్ద నిర్వాణ బిక్షకు వెళ్ళి ఆమె యొక్క పాతివ్రత్య ధర్మం యొక్క శక్తి చేత చిన్న పిల్లలుగా మారిపోయారని, ముగ్గులు అమ్మవార్లు అక్కడకు వెళ్లి అత్రిని భర్తబిక్ష అడగని యెడల, వారు తిరిగి తమ రూపం తీసుకోలేరని చెప్పారు. సరస్వతీ, లక్ష్మీ, పార్వతులు సామాన్య స్త్రీ రూపం ధరించి, అత్రి మహర్షి వద్దకు వెళ్లి పతిబిక్ష పెట్టమని అడిగారు. "ఓ మహర్షి మా భర్తలను తిరిగి మాకు ఇవ్వండి" అన్నారు. అత్రి మహర్షి ఆ ముగ్గురు స్త్రీలను విధిగా గౌరవించి, చేతులు జోడించి ప్రార్థన చేసి, తన కోరిక మరియు తన భార్య అయిన అనసూయ కోరిక నెరవేర్చమని వేడుకున్నారు. అప్పుడు త్రిమూర్తులు అత్రి ముందు తన నిజరూపం స్వీకరించి ఇలా అన్నారు- "ఈ పిల్లవాడు నీ మాట ప్రకారం గొప్పఋషి అవుతాడు మరియు అనసూయ మాత యొక్క కోరిక మేరకు మాకు సమానుడౌతాడు. ఈ పిల్లవాడు దత్తాత్రేయ నామముతో ప్రసిద్ధి పొందుతాడు". అలా చెప్పి వారు అదృశ్యమయ్యారు.
స్వామి శివానంద విరచిత #గురుతత్వము - 46వ భాగము
అత్రి మహర్షి తన ఆశ్రమానికి తిరిగి రాగానే, ఆయన లేని సమయంలో జరిగినవన్నీ అనసూయ మాత పూసగుచ్చినట్టు చెప్పింది. ఆ పిల్లలను ఆయన పాదాల వద్ద ఉంచి, ఆయనను పూజించింది. కానీ అత్రిమహర్షికి తన దివ్యదృష్టి ద్వారా జరిగినదంతా ముందే తెలుసు. ఆ ముగ్గురు పిల్లలను ఆయన దగ్గరకు తీసుకున్నారు. ముగ్గురు పిల్లలు రెండు కాళ్లతో, ఒక మొండెంతో, మూడు శిరస్సులతో మరియు ఆరు చేతులతో ఒకే పిల్లవానిగా మారారు. అత్రి మహర్షి తన భార్యను ఆశీర్వదించి, త్రిమూర్తులు పసిపిల్లలుగా రూపంలో తన వద్దకు వచ్చి అనుగ్రహించారని ఆమెకు తెలియపరిచారు.
నారదుడు బ్రహ్మలోకానికి, వైకుంఠానికి మరియు కైలాసానికి వెళ్ళి సరస్వతి, లక్ష్మీ మరియు పార్వతులకు తమ భర్తలు అనసూయ మాత వద్ద నిర్వాణ బిక్షకు వెళ్ళి ఆమె యొక్క పాతివ్రత్య ధర్మం యొక్క శక్తి చేత చిన్న పిల్లలుగా మారిపోయారని, ముగ్గులు అమ్మవార్లు అక్కడకు వెళ్లి అత్రిని భర్తబిక్ష అడగని యెడల, వారు తిరిగి తమ రూపం తీసుకోలేరని చెప్పారు. సరస్వతీ, లక్ష్మీ, పార్వతులు సామాన్య స్త్రీ రూపం ధరించి, అత్రి మహర్షి వద్దకు వెళ్లి పతిబిక్ష పెట్టమని అడిగారు. "ఓ మహర్షి మా భర్తలను తిరిగి మాకు ఇవ్వండి" అన్నారు. అత్రి మహర్షి ఆ ముగ్గురు స్త్రీలను విధిగా గౌరవించి, చేతులు జోడించి ప్రార్థన చేసి, తన కోరిక మరియు తన భార్య అయిన అనసూయ కోరిక నెరవేర్చమని వేడుకున్నారు. అప్పుడు త్రిమూర్తులు అత్రి ముందు తన నిజరూపం స్వీకరించి ఇలా అన్నారు- "ఈ పిల్లవాడు నీ మాట ప్రకారం గొప్పఋషి అవుతాడు మరియు అనసూయ మాత యొక్క కోరిక మేరకు మాకు సమానుడౌతాడు. ఈ పిల్లవాడు దత్తాత్రేయ నామముతో ప్రసిద్ధి పొందుతాడు". అలా చెప్పి వారు అదృశ్యమయ్యారు.
13/06/2026
రాయప్రోలు రథాంగపాణి గారి హనుమత్సందేశం (20)
ఇటువంటి పరిస్థితిని ముందుగనే గమనించి జాగ్రత్తపడిన నీతివేత్త హనుమ. లక్ష్మణుని సమీపించి
త్వత్తోధికతరో రామో భక్తోయం వానరాధిపః
రామకార్యార్ధమనిశం జాగర్తినతు విస్మృతః.
మహారాజా! ఈ వానరరాజు రామునకు మీకంటెను గొప్ప భక్తుడు, రేబవలు రామకార్యార్థమైన ఆలోచనే. తన కర్తవ్యమును విస్మరించలేదు. ఇదిగో! ఇటు చూడు. నేల యీనినటుల కనిపించే యీ వానర వీరులు సీతామాతను వెతుకుటకై వచ్చినవారు. త్వరలో సీతాన్వేషనార్థమై నేల నాలుగు చెరగులకు వెళ్ళుటకై సిద్ధముగనున్నారు. సుగ్రీవుడు మిత్రకార్య నిర్వహణలో ఏ లోటూ రానీయడు సుమా! అని సమాధానపరచి లక్ష్మణుని ప్రసన్నునిగ చేసెను.
సహజంగా తమ కళ్ళముందు జరుగుతున్న విషయాలలో ఎవరితో ఏమంటే ఏ ప్రమాదం ముంచుకు వస్తుందో మనకెందుకులే కాసేపు కళ్ళు మూసుకుని మౌనం వహిస్తే పోలా" అని సరి పెట్టుకునే మనస్తత్వం కలవాళ్ళే ఎక్కువమంది సమాజంలో తారసపడతారు. సకాలంలో సరియైన సలహా ఇవ్వగలిగికూడా ఇవ్వరు, లోపాలను చెప్పరు. పొగడ్తలతో మాత్రం ముంచెత్తుతారు అవకాశవాదులు. ఎటుచూసినా వారికి స్వార్ధం అడ్డు వస్తుంది. స్వార్థానికై ఎదుటివారిని బలి తీసుకుంటానికి కూడా సిద్ధపడతారు. స్వార్థం కొంచెం ప్రక్కన పెట్టి పరార్ధం కోసం పాకులాడరు. ఏ ఇంటిలో దీపం వెలగకపోతే మాకేం- మా ఇంటిలో దీపం వెలగాలి అనుకుంటుంటారు. అట్టివారి విధానానికి ఆంజనేయుని నీతిజ్ఞత ఒక చురక, ఏమాత్రం బెరుకు లేకుండగా ధైర్యంగా ఎదుటివారిలోని లోపాలను తగినసమయంలో నొప్పింపని రీతిలో ఎత్తిచూపి తగిన జాగరూకత వహించునట్లు చేయగల మతిమంతుడు, సారధి, సచివుడుగా యీ పై సన్నివేశంలో కనిపిస్తాడు హనుమంతుడు. మంచన మతి మహత్తును ఇలా చెప్పాడు -
మతియ కళాకృషి బీజము
మతియ తను ఫలప్రదక్షమాజము తలపన్
మతియ చెలి మతియ చుట్టము
మతిహీనులు చూడ మొరడు మ్రాకులు ధాత్రిన్.
13/06/2026
శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 100 వ భాగం
ద్వైపాయనుడు అనగా రెండు ద్వీపాల మధ్య తిరుగువాడు, వ్యాసుడు కనుక 'పరివ్రజంతం' అని ఉంది. పుత్ర అనే సంబోధనతో ఉన్నాడు. అనగా వ్యాస పుత్రుడు. 'ద్వైపాయనం', అనే మాట శ్లోకంలో ఉంది. 'పుత్రేతి' అని వేరొకచోట ఉంది. సన్న్యాసులను పరివ్రాజకులని అంటారు. అనగా శుకుడు ఇంటినుండి వెళ్ళిపోతున్నాడు. దానికి ముందు రెండు విశేషణాలున్నాయి. అనుపేతం = ఉపనయనం కాకుండా; అపేతకృత్యం = అన్ని శాస్త్ర కర్మలను విడిచినవాడై. అనగా ఉపనయనానికి ముందే బ్రహ్మజ్ఞాని అయ్యాడు.
పుట్టుకతోనే జ్ఞానం. ప్రపంచ సుఖాలు, దుఃఖాలు అంటకుండానే జ్ఞానం సంపాదించడం. 'అనుపేతం' అనినపుడు ఉపనయన వయస్సు వచ్చినా ఉపనయనం కాలేదని అనాలి. ఒకడింకా ఉద్యోగ విరమణ చేయలేదంటే చాలాకాలం నుండి చేస్తున్నాడని, విరమణ కాలం సమీపించిందని అర్థం. క్రొత్తగా ఉద్యోగంలో చేరినవాడిని అట్లా అనం. కనుక ఉపనయనం కాలేదంటే ఉపనయనానికి తగిన వయస్సు వచ్చినా కాలేదని అర్థం. అసలు ఉపనయనం ఏడవ ఏట, బ్రహ్మ వర్చస్సును కావాలని కోరుకొనేవానికి ఐదవ యేటనే చేయవచ్చనే శాస్త్రవాక్యం ఉంది. అనగా ఐదవ ఏడు సమీపించే లోపునే జ్ఞానిగా గుర్తింపబడ్డాడు. అట్లా అని చెప్పడం అతని గొప్పతనాన్ని తగ్గించినట్లు కాదు.
దానికి ముందు 'పరిప్రజంతం' అనగా తిరుగుతున్నవాడై. ఇట్లా వెళ్ళడానికి 4,5 సంవత్సరాలుండాలి. పుట్టీ పుట్టగానే పరుగెత్తడం కుదురదు కదా! అసలు జ్ఞాని ఎక్కడికో వెళ్ళనవసరం లేదు. అయితే ఒకచోట ఉంటే అతడా ప్రదేశానికే పరిమితుడౌతాడని, అతడు వారికి చెందినవాడని వారతనికి చెందినవారనే బంధం ఏర్పడుతుంది. అందువల్ల జ్ఞాని, పరివ్రాజకుడై యుండాలి.
వ్యాసుడెంత గొప్పవాడైనా శుకుని వంటి బ్రహ్మజ్ఞాని కాలేకపోయాడు. ఇంకా అతనిలో పుత్రవ్యామోహం ఉండిపోయింది. ఇంట్లో ఉన్న కొద్దీ బ్రహ్మచర్య దీక్ష, భిక్షాచర్య మొదలైన వాటివల్ల ఇంకా అనుబంధం గట్టిదైపోతుంది. అందువల్ల శుకుడు ఇంటి నుంచి తండ్రికి పుత్ర వ్యామోహం కల్గించకుండా వెళ్ళిపోయాడు. అతని దర్శనం వల్ల ఎందరో బాగుపడాలి. ఇది ఈశ్వర సంకల్పం. అంతేనే కాని తానితరులను దరిచేరుస్తానని శుకుడనుకోడు. ఏ సంకల్పం లేకుండా వెళ్ళిపోయాడు.
వ్యాసుడు తన కుమారుడు పారిపోవడం చూసి పట్టుకుని వెనక్కి తీసుకు రావడానికి ప్రయత్నించాడు. కాని శుకుడు చిక్కలేదు. అపుడు వ్యాసుడు 'పుత్ర, పుత్రా' అని ఎలుగెత్తి ఆక్రోశించాడు.