Veda samskruti

Veda samskruti

Share

We work for revival, resurgence and reawakening of Swadeshi Bharat through Sanatana Dharma.

India of the ages is not dead nor has she spoken her last creative word; she lives and has still something to do for herself and the human peoples. And that which must seek now to awake is not an anglicised oriental people, docile pupil of the West and doomed to repeat the cycle of the occident's success and failure, but still the ancient immemorable Shakti recovering her deepest self, lifting her

17/04/2026

శ్రీదత్త పురాణము (111)

కోరికలు వదులుకుని ఆత్మానందాన్ని అనుభవించటం చేతకాక ఈ లోకులంతా కోరికల వెంట పరుగులు తీస్తున్నారు. దుఃఖభాజనులు అవుతున్నారు. సత్యమూ, జ్ఞానమూ, అనంతమూ, జ్యోతిస్వరూపమూ, సనాతనమూ, అయిన నీ పరబ్రహ్మమైతే ఉన్నదో అదే నేను. అదే ఆత్మ. దత్తాత్రేయుడి దయవల్ల తల్లిదండ్రులు అనుగ్రహం వల్ల సోదరుడి కృషి వల్ల నేను కృతార్ధుణ్ని కాగలిగాను. నిజంగా నిస్సంశయంగా కృతార్థుణ్ని కాగలిగాను.

తండ్రీ, దత్తస్వామి అలర్కుడికి బోధించిన యోగవిద్య అంతా నీకు నేను తెలియచేశాను. దీన్ని నీవు అభ్యసించి ఆచరణలో పెడితే బ్రహ్మానంద స్థితిని పొందుతావు. ముక్తికి యోగమొక్కటే ఉత్తమమార్గం. యజ్ఞాలు, జపాలూ, తపాలు, ఇవన్నీ ఎందుకుగానీ యోగవిద్యను ఉపాసించు. జనకా దయచేసి నాకు అనుజ్ఞ ఇవ్వు అడవులకు వెళ్ళి యోగాభ్యాసం కొనసాగించి నిర్ద్వందుణ్నీ విష్పరిగ్రహుణ్నీ అయ్యి బ్రహ్మభావం పొందటానికి, ముక్తిని పొందటానికి నిర్వృతిని పొందటానికి ప్రయత్నిస్తాను.

తండ్రికి ప్రదక్షిణం చేసి సాష్టాంగ నమస్కారం చేసి లేచి అనుమతి తీసుకుని సుమతి అడవులకు వెళ్ళిపోయాడు. అప్పుడు ఆ తండ్రి ఏమి చేసాడంటే కన్నకొడుకు తనను విడిచి ఎక్కడికో వెళ్ళిపోతున్నాడనే ఆలోచనలతో గుండెల్లో కమ్ముకున్న మమకార దుఃఖం నుండి క్షణంలో తేరుకొని కొడుకు చెప్పిన యోగవిద్యా రహస్యాలను మననం చేసుకుంటూ ఆ క్షణం నుండే యోగాభ్యాసం ప్రారంభించాడు. కొంతకాలానికి పరిణితి చెంది వానప్రస్థం స్వీకరించాడు. ఆపైన మరికొంతకాలానికి నాల్గవదైన సన్యాసాశ్రమం స్వీకరించి యోగసిద్ధి పొందాడు.

నాయనా దీపకా! విన్నావు గదా ఇది దత్తమహిమ. ప్రసక్తానుప్రసక్తంగా పితాపుత్రుల కథ. కార్తవీర్యుడి గాధ. ఆలర్కోపదేశం అన్నీ నీకు తెలిపాను. దత్త మహిమను ఎవరు ఎప్పుడు చెప్పినా, విన్నా, వారికి దత్తుడి అనుగ్రహం వల్ల సమస్తకిల్బిషాలు తొలగిపోతాయి. సంసార సంబంధమైన దుఃఖాలు నశిస్తాయి. ఐశ్వర్యాలు లభిస్తాయి. అహంకార మమకారాలు తొలగి మనస్సు తేలికపడుతుంది. ఈ జీవితం, ఈ జీవకోటి, ఏ సూత్రం మీద నడుస్తున్నాయో అవగతమవుతుంది. ఆత్మకు ధైర్యమూ, చైతన్యమూ ఏర్పడతాయి. యోగాభ్యాసం పట్ల గురికుదిరి అంతిమంగా నిర్వాణానుభూతి కలుగుతుంది- అని చెప్పి వేదధర్ముడు కాసింత విశ్రాంతి తీసుకున్నాడు అంటూ బ్రహ్మకలి పురుషునితో చెప్పాడు.

17/04/2026

శ్రీ గరుడ పురాణము (151)

మహారాజుల అరచేతుల్లో పరమశుభకరములైన శంఖ, ఛత్ర, శిబిక, గజ, పద్మాకార చిహ్నాలుంటాయి. కుంభ, అంకుశ, పతాక, మృణాళ చిహ్నాలు అతులనీయ ఐశ్వర్యం గల మహారాజల కరతలంపై వుంటాయి. అరచేతిలో త్రాటిగుర్తున్న వారికి గోధనం మెండుగా వుంటుంది. స్వస్తిక చిహ్నమున్నవారు సమ్రాట్లవుతారు. చక్రం, కత్తి, తోమరం, విల్లు, బల్లెం ఆకారంలో గుర్తులు అరచేతిలో నున్నవారు కూడా రాజులవుతారు.

చేతిలో రోకలి గుర్తున్నవారు యజ్ఞాది కర్మకాండలు చేయించడంలో నిష్ణాతులవుతారు; వేదికాకారమున్నవారు 'అగ్నిహోత్రి' అనే పదానికర్హులౌతారు; నూయి, దేవకుల్యం, త్రికోణం వున్నవారు ధార్మికులు.

అంగుష్ఠమూలంలో దళసరి రేఖలున్నవారికి కొడుకులూ, పలచటి గీతలున్నవారికి కూతుళ్ళూ ఎక్కువగా పుడతారు. చిటికెన వేలి మూలంలో మొదలై చూపుడు వేలి మూలందాకా పయనించే రేఖ గలవారు నూరేళ్ళూ జీవిస్తారు. కాని, ఆ రేఖ ఎక్కడైనా విచ్ఛిన్నమైపోతే, చెట్టు మీది నుండి క్రిందపడి మరణిస్తారు. రేఖలు మరీ ఎక్కువగా నున్న మానవులు దరిద్రులౌతారు. చిబుకం కృశించిపోయినట్లుండుట ధనహైన్యానికీ, మాంస పుష్టితో నుండుట సంపన్నతకీ సూచనలు.

స్నిగ్ధంగా, దిట్టంగా సమానభాగాలలో వుండే సుందర, తీక్షదంతాలు శుభప్రదం. రక్తవర్ణంలో, సమతలంగా, నున్నగా, పొడుగ్గా వుండే నాలుక మంచి లక్షణం, ధనికుల ముఖాలు కొంచెం కోలగానూ, నిర్ధనుల వదనాలు పొడవుగానూ, రాజుల ముఖాలు, సౌమ్యంగా, బలంగా, నున్నగా, మలరహితంగానూ వుంటాయి. పాపకర్ముని మొగము భయాక్రాంతంగానూ, ధూర్తుని వదనం నలుపలకలుగానూ వుంటాయి. దింపుడు ముఖాలు పుత్రహీనులకూ, చిన్నముఖాలు పీనాసులకూ ఉంటాయి. భోగుల ముఖాలు, సుందరంగానూ, కాంతివంతంగానూ, కోమలంగానూ, మీసాలతోనూ వుంటాయి.

చోరవృత్తిని ఇష్టపడే పురుషుని ముఖం నిస్తేజంగా, ముడుచుకున్నట్లుండి, ఎఱ్ఱని మీసాలతో ఎఱ్ఱని గెడ్డంతో వుంటుంది; స్త్రీముఖంలో గెడ్డం, మీసాలు వుండవు. చిన్న చెవులూ, ఎఱ్ఱని, పెద్ద వెంట్రుకలూ గలవారు పాపకర్మం చేస్తూ మృతి చెందుతారు. శంకువు ఆకారంలో చెవులున్నవారు రాజులౌతారు గానీ చెవులలో ఎక్కువ వెంట్రుకలు మొలిస్తే శీఘ్రమరణముంటుంది. పెద్ద చెవులవారు ధనికులౌతారు. గండస్థలం క్రిందికున్నవారు భోగులౌతారు; పూర్ణంగా, సుందరంగానున్నవారు మంత్రులవుతారు.

17/04/2026

గణపతి సహస్రనామం రోజుకో నామం - 402

ఓం ఉన్నతాననాయ నమః
ॐ उन्नताननाय नमः ।
Om Unnatananaya Namaha

అర్దం - ఉత్కృష్టులైన బ్రహ్మదేవుడు మొదలైన వారికి ప్రాణమును ఇచ్చువాడు.

--------------------------------------

మీకు వీలైతే అదే నామాన్ని తిరిగి కామెంట్ లో రాయండి.

16/04/2026

The greatest dharma of man is paropakara (doing good to others). If, while you are living for yourself, you also start living for others, make others happy, and then only you become human, because this is the essence of humanness.

-Swami Chidananda

16/04/2026

Hanuman Chalisa - 17

तुम्हरो मंत्र विभीषण माना ।
लंकेश्वर भये सब जग जाना ॥

Tumharo Mamtra Vibhiissann Maanaa |
Lamkeshvar Bhaye Sab Jag Jaanaa ||

Meaning:

Vibhisana Followed your Advice,
And the Whole World Knows that he became the King of Lanka.

Inspiration 16/04/2026

ఓం శ్రీ రామాయ నమః

వనవాసానికి వెళ్ళాలనుకున్న రాముడు సీతమ్మను అయోధ్యలోనే ఉండి సమస్త రాజభోగాలు అనుభవించమంటాడు. చాలా విధాలుగా చెప్పి చూస్తాడు.

అప్పుడు సీతమ్మ ప్రేమ వలన కలిగిన కోపంతో "ఏం మాట్లాడుతున్నావు రామ, నువ్వేం చెప్తున్నావో నీకు అర్దం అవుతోందా? ఎవరైన నీ మాటలు వింటే నవ్విపోతారు. తల్లిదండ్రులు, కొడుకు, కోడళ్ళ అదృష్టం వారు చేసుకున్న పుణ్యకర్మల మీద ఆధారపడి ఉంటుంది. కానీ భార్య అదృష్టం భర్త మీదే ఆధారపడి ఉంటుంది. అతను చేసుకున్న కర్మల ఫలాన్ని భార్య కూడా అనుభవిస్తుంది. అందువల్ల నువ్వు అడవులకు వెళ్తె నీతో పాటే వనవాసానికి నేను వస్తా. స్త్రీ తల్లి, తండ్రి, కొడుకులు, మిత్రుల దగ్గర ఉంటే సంతోషంగా ఉండదు. స్త్రీ జీవించినా, మరణించినా భర్త దగ్గరే ఉండాలని కోరుకుంటుంది, అదే సంతోషంగా భావిస్తుంది.

ఓ రామా! నువ్వు అడవులకు బయలుదేరితే నీ ముందు నేను నడుస్తా. కష్టమైన అటవిమార్గంలో నీ కాళ్ళకు అడ్డివచ్చే ముళ్ళను ముందు నేనే తొక్కుతా. నీకు అపాయం రాకుండా చూసుకుంటా. నీ మార్గాన్ని సుగమం చేస్తా.

ఓ వీరుడా! భర్త పాదాల వద్ద ఉండే రక్షణ కంటే పెద్దపెద్ద బహుళ అంతస్థుల భవనాల్లో ఉండడం, విమానాల్లో తిరగడం గొప్ప ఏమీ కాదు. నాకు చిన్నవయసులోనే మా అమ్మనాన్న అన్నీ నేర్పించారు. నేను నీకు అన్ని విషయాలు చెప్పనవసరంలేదు.

సందేహమే లేదు, నేను నీతో అడవికి వస్తాను. నువ్వు నన్ను ఈ విషయంలో ఆపలేవు" అని అంటుంది.

భార్య భర్త పట్ల ఎంత ప్రేమ చూపిస్తుందో, సమస్త భోగాలకన్నా భర్తే మిన్న అని అన్నిటిని భర్త కోసం విడిచిపెట్టగలుగుతుందో సీతమ్మ మాటలలో మనకు అర్దమవుతుంది. భార్యకు కావల్సింది భర్త ప్రేమయే కానీ అంతకుమించి మరేమీ కాదు.

ఈ లోకంలో ఉన్న భార్యభర్తలందరూ ఒకరిపట్ల ఒకరు ప్రేమానురాగాలతో, గొడవలు లేకుండా జీవించాలని ఆ సీత సమేత శ్రీ రామచంద్ర మూర్తిని వేడుకుందాం.

- వాల్మీకి రామాయణం, అయోధ్యాకాండ, 27వ సర్గ.

ఓం శ్రీ రామాయ నమః

Swami Sivananda 16/04/2026

Mental actions are real actions. Thought is the real action; it is a dynamic force. It may be remembered, thought is very contagious; nay, more contagious than the Spanish Flu - Swami Sivananda

16/04/2026

మన సంస్కృతియే మనకు శ్రీ రామ రక్ష (2)

ఒకప్పుడు మన సంస్కృతిలో బయటికి వెళ్లి రాగానే కాళ్ళు, చేతులు కడుక్కుని, నోరు పుక్కిలించి, అప్పుడు లోపలికి వచ్చేవారు. మరీ దూరం వెళితే, కొన్ని సందర్భాల్లో స్నానం చేసి మళ్లీ వేరే బట్టలు కట్టుకొని లోనికి వచ్చేవారు. ఎప్పుడు కరోనా వైరస్ వచ్చిన తర్వాత మనకు ఆ ఆ వైరస్ ఎక్కడ అంటుకుంటుందో అనే భయంతో చెప్పులతో ఇంట్లోకి రాకుండా చేతులు, కాళ్ళు శుభ్రంగా కడుక్కొని ఇంట్లోకి వస్తున్నారు. మరీ రోడ్డు మీద వెళితే స్నానం చేసి, ఆ బట్టలు అప్పుడే ఉతికి ఆరేసి, వేరే బట్టలు కట్టుకొని వస్తున్నారు. ఒకప్పుడు ఇది మనం పాటించిన సంప్రదాయం. అయితే కేవలం ఇలాంటి వైరస్‌ల నుంచి తప్పించుకోవడానికే ఈ సంప్రదాయం రాలేదు.

మన జీవితంలో ఎక్కువ సమయం గడిపే ప్రదేశం మన ఇల్లు. కార్యాలయంలో పని చేసి వచ్చినా లేదా బయటి ఎంత తిరిగినా ఇంటికే రావాలి. కాబట్టి మన ఇల్లు ప్రశాంతంగా ఉండాలి. అంటే ఇంట్లో పాజిటివ్ శక్తి అధికంగా ఉండాలి. మనము బయటికి వెళ్ళామనుకోండి, అక్కడ చాలా మంది వ్యక్తులు మనకు కనబడతారు. అందరికి రకరకాల ఆలోచనలు ఉంటాయి. ఆలోచన అనేది ఒక శక్తి, అది మంచి ఆలోచన కావచ్చు, చెడు ఆలోచన కావచ్చు. మంచి ఆలోచన పాజిటివ్ శక్తి అనగా సకారాత్మక శక్తిని మనకు ఇస్తే, చెడు ఆలోచన నెగిటివ్ అనగా నకారాత్మక శక్తిని ఇస్తుంది. మనము బయటికి వెళ్ళినప్పుడు ఇలాంటి రకరకాల ఆలోచనలు మనతోపాటే వస్తాయి. మనల్ని చూసి చాలామంది చెడుగా (అసూయ, ద్వేషం మొదలైనవి) కూడా ఆలోచించవచ్చు. అవి కూడా మన మీద ప్రభావం చూపిస్తాయి. మనం దిష్టి అంటాం కదా అదే ఇది. మరి వీటన్నింటినీ ఇంట్లోకి మోసుకుని వెళ్లడం చాలా తప్పు. ఎందుకంటే ఇంట్లో వాతావరణం ప్రశాంతంగా ఉండాలి. అందుకే మన పూర్వీకులు బయటికి వెళ్లి రాగానే కాళ్ళు, చేతులు శుభ్రంగా కడుక్కోవాలి, ఆ తర్వాతే లోపలికి వెళ్ళాలి అని నియమం పెట్టారు. ఎందుకంటే ఇలా చేయడం వలన మాత్రమే నకారాత్మక శక్తి వెళ్లి పోతుంది. కనుక మనము ప్రశాంతంగా ఉండవచ్చు.

రెండవది ఏమిటంటే మనమంతా హిందువులం విగ్రహారాధన చేస్తాం, కొందరు అగ్నిహోత్రం కూడా చేస్తారు. మన ఇంట్లో ఉండే విగ్రహం కేవలం బొమ్మ కాదు అది దేవుడు, అది అమ్మ. అంటే మన ఇల్లు కూడా పవిత్రమైనదే. ఈ భావన అందరిలోనూ ఉంటుంది. అందుకే మన ధర్మంలో దేవుడు అంతటా వ్యాపించి ఉన్నాడని చెప్పినా, అధికంగా శుభ్రతకు భగవంతుడికి ముడిపెడతాము. లక్ష్మీ పూజ తీసుకోండి, లక్ష్మీదేవి పూజ చేస్తున్నామంటే ముందు మనం చాలా శుభ్రతను పాటిస్తాము. దానికి కారణం ఎక్కడ శుచి శుభ్రత ఉంటే అక్కడ లక్ష్మీ ఉంటుంది. పెద్ద పెద్ద పూజలు చేయకపోయినా కనీసం రోజు దీపం పెట్టినా, మన ఇంట్లో కూడా భగవంతుడు ఉంటాడు. అందుచేతనే ఎక్కడికి వెళ్లి వచ్చినా తప్పకుండా చెప్పులు బయటే వదిలి, కాళ్లు చేతులు, కడుక్కునే ఇంట్లోకి అడుగు పెట్టే సంప్రదాయం వచ్చింది. ఎవరైనా ఇంటికి వస్తే తప్పకుండా వాళ్ళకి కాళ్లు, చేతులు శుభ్రం చేసుకోవడానికి నీళ్లు ఇస్తాము. ఈరోజు మన ఇళ్ళల్లో ప్రశాంతత లేకపోవడానికి, అనారోగ్యం రావడానికి ఇది కూడా ఒక కారణం.

కనుక కేవలం వైరస్‌లే కాదు, చికాకుల నుంచి మన ఇంటిని రక్షించుకోవాలన్నా, ఇది మనం తిరిగి పాటించడం ప్రారంభించాలి.

Veda samskruti

16/04/2026
16/04/2026

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (234)

ముక్తికై అన్వేషించే వానిని ముముక్షువని అంటాం. ఈ స్థితి భక్తివల్లనే అతనికి కొద్దికాలంలో ముక్త స్థితి రాబోతుంది. అట్టి పరిస్థితిలో ఒక ధర్మసంకటానికి లోనౌతాడు. అది కన్యాదానం చేసే తండ్రి స్టితి వంటిది. తండ్రి వివాహ ప్రయత్నాలు చేసినట్లుగా ముక్తికై ధర్మకృత్యాలను లోగడ చేసాడు. భక్తి మార్గాన్ని అనుసరించాడు. దానివల్ల చిత్త శుద్ధి ఏర్పడింది. ఇక పరమాత్మలో లీనమయ్యే స్థితి ఏర్పడింది. ఎప్పుడైతే అతని మనస్సు లీనమైందో ఇక భగవంతుడూ లేదు, భక్తి లేదు. కన్యాదానం చేసేటపుడు తండ్రి కన్నీళ్లు పెట్టుకొన్నట్లుగా ముముక్షువు కూడా తన మనస్సును అర్పించేటపుడు దుఃఖపడతాడు. ఈ బాధనొక కవి అందంగా వివరించాడు.

భస్మో ద్దూళన భద్రమస్తు భవతే

అనగా పరమేశ్వరుడు నా భక్తికి సంతోషించి అతనిలో కలుపుకొన బోతున్నాడు. ఇక నుండి విభూతిని పూసుకోనవసరం లేదుకదా! రుద్రాక్షలు ధరించడం ఉండదు కదా! మీరు వెళ్లిరండి, మీకు మంగలమగుగాక! ఓ భక్తి మార్గమా? నీకూ వీడ్కోలు చెబుతున్నా, నేను మోక్షమనే మహామోహంలో కూరుకొని పోయాను. ఆమోహం మిమ్ములనన్నిటినీ దూరంగా ఉంచేది. ఇంత వరకూ భక్తినాకానందాన్నిచ్చింది చాలు.

మోక్షం, మోహాన్ని పోగొట్టేది. కానీ ఇట్టి వానికి మోక్షమే మోహంలా కనబడింది. భక్తి మొదలగు వాటిని విసర్జిస్తున్నాడు. అట్లాగే కృష్ణ కర్ణామృతంలోనూ ఉంది. భక్తి పరిపక్వమైతే కర్మమార్గం నుండి దూరమై పోతాడు.

16/04/2026

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 45 వ భాగం

గీత ఇచ్చిన అభయం- సమస్య పరిష్కారం -

గీతలో సాధువుల్ని రక్షించడం, దుష్టులను శిక్షించడం అవతార ప్రయోజనమని యుంది.

శంకరుల కాలంలో సత్పురుషులను రక్షించనవసరం లేకపోయింది. పూర్వకాలంలో సత్పురుషులెక్కువగా ఉండేవారు కనుక వారిని ఈశ్వరుడు రక్షించవలసి వచ్చింది. కాని కలిలో సత్పురుషులే తక్కువ. వీరిని రక్షించడం తేలికే. ఇక దుష్టులను సంహరించడమేమిటి? పూర్వావతారాల కాలంలో అసుర రాక్షసులు, క్రూరమైన రాజులు, వారి సహచరులూ చాలామంది ఉండేవారు కనుక విడిగా గుర్తించి వారిని సంహరించడం జరిగింది.

మరీ శంకరుల కాలంలో ఆనాడు రాక్షసులులేరు. కంస, జరాసంధుల వంటివారు లేరు. అసుర లక్షణాలు కలిగిన దుర్యోధనుని వంటివారు కృష్ణుని కాలంలో కంటె శంకరుల కాలంలో ఎక్కువగా ఉన్నారు. మంచిగా కనబడుతూ అధర్మాన్ని పాటించేవారే ఎక్కువగా ఉండేవారన్నమాట. కొంతమందిని మినహాయిస్తే అధర్మమే ఎక్కువగా ప్రబలియుంది కనుక ఇట్టి వారిని విడదీసి సంహరించడం అంటూ కుదరదు. దుష్టులను సంహరించడం అనే మాటను పాటిస్తే అందర్నీ సంహరించవలసి వచ్చేది. అపుడు ధర్మ సంస్థాపనమెట్లా అవుతుంది? రాబోయే ప్రలయాన్ని ముందే ఆహ్వానించినట్లే కదా!

విశ్వామిత్రుడు యాగం చేసేటపుడు కొందరు రాక్షసులు రావడం, రాముడు సంహరించడం, యాగ సంరక్షణ జరిగింది. ఆ విశ్వామిత్రుడే కలియుగంలో పుడితే అతనికి యాగం చేయాలనే సంకల్పమే ఉండదు.

కనుక కలిలో దుర్మార్గులను చంపడం కాదు. దుర్మార్గ ప్రవృత్తిని సంహరించాలని పరమేశ్వరుడు భావించాడు. చెడ్డ వారనుటకు బదులు చెడ్డ పనులను అని సవరించాలి.

16/04/2026

శ్రీదత్త పురాణము (110)

సుమతీ ఆ తర్వాత ఏమయ్యింది ? నిరక్తుడైన అలర్కుడు రాజ్యాన్ని ఎవరికి అప్పగించాడు ? సుబాహువు మరి తన తమ్ముడ్ని ప్రశంసించలేదా ? ఇలా ప్రశ్నిస్తున్న తన తండ్రికి తరువాత కధను సుమతి ఇలా వివరించాడు. అది కూడా నీకు చెబుతాను అంటూ వేదధర్ముడు దీపకుడికి అలర్కకథను ఇలా చెప్తున్నాడు.

కాశీరాజు వీడ్కోలు చెప్పాక అలర్కుడు సుబాహువుకు పాదాభివందనం చేసాడు. అన్నా నన్ను కృతార్ఖుడ్ని చేసావు. కృతజ్ఞుణ్ని చిన్నప్పుడు అమ్మ మీ ముగ్గురికీ బ్రహ్మజ్ఞానం నూరిపోసింది. నాకు ఆ అదృష్టం లేకపోయింది. లౌకిక మార్గంలో పడి రాజ్యపాలన అంటూ జడుడ్ని అయ్యాను. నీ దయవల్ల ఇప్పటికి విముక్తుడ్ని కాగలిగాను అని ఆనందభాష్పములు రాలుస్తూ వణుకుతున్న కంఠంతో మాట్లాడుతున్న తమ్ముణ్ణి అర్ధంగా కౌగలించుకున్నాడు. సుబాహువు, తమ్ముడూ! నీ బ్రహ్మజ్ఞానం మీద నాకు నమ్మకం కుదిరింది. ఏది చెయ్యాలో అది చేసావు. కాబట్టి ఇంక నీ యిష్టం. రాజ్యమే ఏలుకుంటావో, అడవులకే వెడతావో నిర్ణయించుకో. ఇందులో నాకు కృతజ్ఞతలు చెప్పవలసింది. ఏదీ లేదు. అంతా దత్తాత్రేయుడి అనుగ్రహం. శుభమగుగాక అని ఆశీర్వదించి సుబాహువు నిర్లిప్తంగా నడిచి వెళ్ళిపోయాడు.

అలర్కుడు అంతఃపురానికి వెళ్ళి ఆ రోజే తన పెద్ద కొడుకుకి రాజ్యపట్టాభిషేకం జరిపించి పరిపాలనా బాధ్యతలు అప్పగించి తాను ధర్మపత్నీ సమేతుడై వానప్రస్థానికి వెళ్ళాడు. అక్కడ కొంతకాలం యోగాభ్యాసం చేస్తూ కొంత కాలానికి నిర్ద్వంద్వుడూ, నిష్పరిగ్రహుడూ అయి యోగసిద్ధిని పొందాడు. నిర్వాణ ఫలాన్ని చవిచూసాడు. ఆ స్థితి నుండి ఈ జగత్తు అంతా తిలకించాడు. దేవ, అసుర, మానవగణాలతో పశుపక్ష్యాది జాతులతో అనేక రకములై వృక్షసంపదలతో కిటకిటలాడుతున్న జగత్తు సత్వ, రజస్తమో గుణాలనే బంధాలలోబడి కొట్టుమిట్టాడుతున్న వైనం కనిపించింది. బిడ్డలనీ, తోబుట్టులనీ, మిత్రులనీ, శత్రవులనీ, తనవారనీ, పరాయివారనీ ఏవేవో బంధాలు - సంబంధాలు కల్పించుకుంటూ తన్నులాడుకుంటున్నారు. కామక్రోదాదులకులోనై దుఃఖారులవుతున్నారు. అజ్ఞానమనే బురదగుంటలో పడిదొర్లుతున్నారు. ఉద్ధరించే దిక్కు లేక అల్లల్లాడుతున్నారు. తానొక్కడూ గట్టు మీద నిలబడి చూస్తునట్లు దర్శనం అయ్యింది. అప్పుడు అతని నోటి నుండి అప్రయత్నంగా ఇలా అన్నాడు.

ఓహో! ఒకప్పుడు నేను అనుభవించిన రాజ్యభోగాలు సుఖాలు ఇప్పటి ఈ నిర్వాణానుభవంతో పోలిస్తే అవి ఏ పాటి? యోగాన్ని మించిన పరమ సుఖం లేదు గాక లేదు. కాంతాకనకాలు వస్తు వాహనాలు - ధనధాన్యాలూ - లోకంలో ఏ ఐశ్వర్యమైనా, అది అందించే ఆనందమైనా యోగం అందించే ఆనందంలో పదహారవవంతు కూడా లోకంలోని ఏ కాదు.

Want your business to be the top-listed Gym/sports Facility in Mumbai?

Click here to claim your Sponsored Listing.

Location

Address


Mumbai